Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ట్రాకుల పక్కన కాగితాలు ఏరుకునే తండ్రీకూతుళ్లు 2000 మందిని కాపాడారు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (14:27 IST)
ఇతని పేరు స్వపన్ దిబ్రామ, రైల్వే ట్రాకుల పక్కన కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుని వాటిని అమ్ముకుని బ్రతుకుతుంటాడు. పక్కనున్న అమ్మాయి అతని కూతురు. రోజులానే రైల్వేట్రాకు పక్కన కాగితాలు ఏరుకుంటున్న వీరికి ఒక రైల్వే పట్టా విరిగిపోయి కనిపించింది. త్రిపురలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ భూమి కోసుకు పోయి, అక్కడ పట్టాలు విరిగిపొయాయి. అంతలొ అటువైపు నుండి 2000 మంది పాసింజర్లతొ ట్రైన్ వస్తుంది.
 
రైలు రావడాన్ని చూసిన స్వపన్ దిబ్రామ, అతని కూతురు వెంటనే తమ చొక్కాలను విప్పి, ట్రైన్ ఆపమని చొక్కాలను ఊపుతూ ఆ రైలుకు ఎదురుగా పరుగెత్తుకెళ్ళి, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రైలును ఆపివేయించారు. దిబ్రామ, అతని కూతురు చేసిన ఈ సాహసం వలన దాదాపు 2000 మంది ప్రాణాలు కాపాడబడ్దాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న త్రిపుర మంత్రి "రాయ్ బర్మన్", వీరిద్దరిని అతని అధికార నివాసానికి పిలిపించి, ఇద్దరికీ మంచి బట్టలు కొనిపెట్టి, VIP లు డిన్నర్ చేసే చోట తండ్రికూతుళ్లతో కలిసి భొజనం చేశారు. అంతేకాకుండా త్రిపుర అసెంబ్లీ వీరిని అభినందించి, వీరు సౌకర్యంగా బ్రతికేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితొ పాటుగా రైల్వే శాఖ వీరికి ప్రత్యేక నగదు బహుమతి ప్రకటించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments