Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూరగాయలు సరిగ్గా తరగడం రాదా.. అంతే అత్తపై కోడలు..?

కూరగాయలు సరిగ్గా తరగడం రాదా.. అంతే అత్తపై కోడలు..?
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:50 IST)
చిన్న చిన్న విషయాలకే ఆగ్రహావేశాలకు గురయ్యే వారు నేరాలకు పాల్పడుతున్నారు. హంతకులుగా మారుతున్నారు. తాజాగా కూరగాయలు సరిగ్గా కోయమంటూ దుర్భాషలాడిన అత్తపై కోడలు కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన 62 ఏళ్ల మోహినీ దేవికి, తన కోడలు మమతా దేవితో ఒక్క క్షణం పడేది కాదు. 
 
గత సోమవారం మమత కూరలు తరుగుతూ ఉంటే మోహిని అక్కడకు వచ్చి.. `కూరగాయలు సరిగా కోయడం రాదా..` అంటూ దుర్భాషలాడింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన మమత కూరగాయలు కోసే కత్తితో అత్తపై దాడి చేసింది.
 
అత్త శరీరంపై 26 చోట్ల కత్తితో గాయాలు చేసింది. అనంతరం తన లగేజీ తీసుకుని ఇంటి నుంచి పరారైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మమతను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ వర్థంతి : ఒంటరినై పోయానంటూ షర్మిల ట్వీట్