Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (20:01 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ పెరిగిపోతున్నాయని, రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదులు దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. 
 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. రేపు ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
కాశ్మీర్‌లో భద్రతా లోపాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఫరూక్ అబ్దుల్లా ప్రస్తావించారు. పహల్గాం దాడి జరగడానికి భద్రతా నిఘా వైఫల్యాలు కూడా కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి నివారించాలంటే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, దాని వెనుక ఉన్న శక్తులను వీలైనంత త్వరగా గుర్తించి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments