Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో రైతన్నల ట్రాక్టర్ ర్యాలీ.. హస్తినలో శకటాలు, ట్రాక్టర్లు

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (11:12 IST)
Farmers Rally
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరు చేస్తున్న రైతుల ఆందోళన కీలక ఘట్టానికి చేరుకుంది. రైతులంతా కిసాన్ గణతంత్ర పరేడ్‌కు సిద్ధమయ్యారు. టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించాయి. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దేశ రాజధానిలో పరేడ్‌కు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఇప్పటికే ట్రాక్టర్లతో దిల్లీకి చేరుకున్నారు. ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో రైతు సంఘాలతో ఒప్పందం చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఐదువేల ట్రాక్టర్లు, ఐదు వేల మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. 
 
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో భారీ కవాతు నిర్వహించేందుకు పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ నంచి భారీ సంఖ్యలో కర్షకులు తరలివచ్చారు. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన వెంటనే ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపుర్‌లోని దీక్షా శిబిరాల వద్ద నుంచి శకటాలు, ట్రాక్టర్లు ప్రదర్శనగా బయలుదేరనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments