Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యం పట్టిందని నిమ్మకాయల్ని తొక్కించారు..

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (10:50 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులే తమ కుమార్తెలను దారుణంగా హత్య చేసిన ఘటన భారత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తమ కుమార్తెలకు దెయ్యం పట్టిందని కొద్ది రోజుల క్రితం పద్మజ కొందరు మంత్రగాళ్ళను ఇంటికి పిలిపించినట్లు పోలీసులు గుర్తించారు. 
 
వాకింగ్‌కి వెళ్ళినప్పుడు మంత్రించిన నిమ్మకాయలు తొక్కారని దీంతో వారికి దెయ్యం పట్టిందని పద్మజ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ భయంతోనే మంత్రగాళ్ళను పిలిపించగా ఆ వచ్చిన మంత్రగాళ్ళు పిల్లలిద్దరికీ తాయత్తులు కట్టి మెడలో రుద్రాక్ష మాలలు వేసినట్లు ఆమె చెబుతోంది.
 
ఇంటి చుట్టు నిమ్మ కాయలు కట్టిన తాంత్రికుడు నాలుగు రోజుల పాటు ఇంట్లోనే క్షుద్ర పూజలు కూడా చేసినట్లు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం దెయ్యం కనిపించిందని. చిన్నమ్మాయి దివ్య కేకలు పెట్టినట్లు చెబుతున్నారు. అయితే దెయ్యం ఆమెను ఆవహించింది అని భావించి అలేఖ్య ఆమె తల మీద దంబెల్ తో కొట్టి చంపిన దట. ఆమెను బతికించడం కోసం ఆమె మృతదేహం చుట్టూ పద్మజ, పురుషోత్తమ నాయుడు, అలేఖ్య ముగ్గురు కలిసి నగ్నంగా పూజలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. 
 
అనంతరం చనిపోయిన చెల్లిని బతికించడానికి తన ప్రాణం తీయాలని అలేఖ్య తల్లిని కోరిందట. ఆమె కోరిక మేరకు నవధాన్యాలు పోసిన చిన్నపాటి కలశం నోట్లో పెట్టి అలేఖ్య కూడా తల్లి పద్మజ కొట్టి చంపింది. ఇక తాంత్రికుల రాకపోకలు విజువల్స్ కూడా సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. అయితే ఈ సిసి ఫుటేజ్ బయటకు రాకుండా పోలీసులు రహస్యంగా ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments