Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం... ఫైజాబాద్ ఎంపీ కంటతడి...!!

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (12:24 IST)
శ్రీరాముడు కొలువైవున్న అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయం తెలిసిన ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ కంటతడిపెట్టారు. బాధిత యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 
 
దళిత యువతిపై హత్యాచారం ఉత్తరప్రదేశ్లో దుమారం రేపుతోంది. అయోధ్య సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గురువారం రాత్రి భాగవతం వినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఆమె మృతదేహాన్ని అత్యంత దారుణస్థితిలో గ్రామ సమీపంలోని కాల్వలో గుర్తించారు. కాళ్లుచేతులు విర గ్గొట్టి, కళ్లు పీకేయడమే కాక మర్మావయాల్లో కర్ర దూర్చినట్లు తేలింది. శరీరంపై ఇతర చోట్లా తీవ్ర గాయాలున్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
 
యువతి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని విమర్శించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చాకే నిజానిజాలు తేలుతాయని స్థానిక పోలీసులు తెలిపారు. 
 
కాగా, హత్యాచార ఘటనపై మీడియాతో మాట్లాడుతూ ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ కన్నీటి పర్వంతమయ్యారు. 'ఓ మర్యాద రామా. ఓ సీతమ్మ తల్లీ మీరెక్కడున్నారు?" అంటూ రోదించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని లేదంటే. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తుతానని, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments