అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం... ఫైజాబాద్ ఎంపీ కంటతడి...!!

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (12:24 IST)
శ్రీరాముడు కొలువైవున్న అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయం తెలిసిన ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ కంటతడిపెట్టారు. బాధిత యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 
 
దళిత యువతిపై హత్యాచారం ఉత్తరప్రదేశ్లో దుమారం రేపుతోంది. అయోధ్య సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గురువారం రాత్రి భాగవతం వినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఆమె మృతదేహాన్ని అత్యంత దారుణస్థితిలో గ్రామ సమీపంలోని కాల్వలో గుర్తించారు. కాళ్లుచేతులు విర గ్గొట్టి, కళ్లు పీకేయడమే కాక మర్మావయాల్లో కర్ర దూర్చినట్లు తేలింది. శరీరంపై ఇతర చోట్లా తీవ్ర గాయాలున్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
 
యువతి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని విమర్శించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చాకే నిజానిజాలు తేలుతాయని స్థానిక పోలీసులు తెలిపారు. 
 
కాగా, హత్యాచార ఘటనపై మీడియాతో మాట్లాడుతూ ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ కన్నీటి పర్వంతమయ్యారు. 'ఓ మర్యాద రామా. ఓ సీతమ్మ తల్లీ మీరెక్కడున్నారు?" అంటూ రోదించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని లేదంటే. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తుతానని, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments