రాజ్యసభకు రంజన్ గగోయ్... సభ్యత్వాన్ని ఎందుకు స్వీకరించానో వివరిస్తా

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (16:45 IST)
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన న్యాయకోవిదుడుగా గుర్తింపు పొందిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన్ను రాష్ట్రపతి కోటా నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు నామినేట్ చేసింది. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఎందుకంటే.. గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులెవ్వరూ ఇలా రాజ్యసభకు నామినేట్ కాలేదు. కొన్ని దశాబ్దాల క్రితం.. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్‌లో చేరి ఆ తర్వాత పార్లమెంట్‌ సభ్యుడయ్యారు. 1991లో రిటైర్ అయిన ఆయన 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
 
కానీ, ఇపుడు రంజన్ గగోయ్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు నామినేట్ చేసింది. ఇపుడుడ ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, రాష్ట్రపతి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వివరంగా చెబుతానని జస్టిస్ గొగోయ్ అంటున్నారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "నేను రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మొదట నన్ను ప్రమాణ స్వీకారం చేయనీయండి. ఆ తర్వాతే మీడియాతో మాట్లాడుతా. ఈ సభ్యత్వాన్ని ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో స్పష్టంగా చెబుతా" అని ఆయన తెలిపారు. దాదాపు 13 నెలల పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రంజన్‌ గతేడాది నవంబర్‌‌లో పదవీ విరమణ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments