Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేధించిన భార్య.. ఎందుకోసమో తెలుసా?

భార్యను కట్నం కోసం వేధించే భర్త గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య వేధింపులను భరించలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:05 IST)
భార్యను కట్నం కోసం వేధించే భర్త గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య వేధింపులను భరించలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన రమేశ్ (50) కు భార్య లలిత (45), కుమారుడు శ్రీధర్ ఉన్నాడు. 
 
అయితే రమేష్ పేరు మీద బ్యాంకులో రూ.2 కోట్ల నగదు ఉంది. అంతేకాకుండా ఇళ్లు, షాపులపై నెలకు రూ.30 వేల వరకూ అద్దెలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లీకుమారులు కలిసి ఆస్తి తమ పేరిట రాసివ్వాలని రమేష్‌ను డిమాండ్ చేశారు. ఇందుకు రమేష్ ఒప్పుకోకపోవడంతో వారం రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేశారు. ఆదివారం రమేష్ అరుపులు విన్న స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు.
 
దీంతో రమేష్‌ను బంధువు గోపాల్ ఈరోడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు భార్య కుమారుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments