Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేధించిన భార్య.. ఎందుకోసమో తెలుసా?

భార్యను కట్నం కోసం వేధించే భర్త గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య వేధింపులను భరించలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:05 IST)
భార్యను కట్నం కోసం వేధించే భర్త గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య వేధింపులను భరించలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన రమేశ్ (50) కు భార్య లలిత (45), కుమారుడు శ్రీధర్ ఉన్నాడు. 
 
అయితే రమేష్ పేరు మీద బ్యాంకులో రూ.2 కోట్ల నగదు ఉంది. అంతేకాకుండా ఇళ్లు, షాపులపై నెలకు రూ.30 వేల వరకూ అద్దెలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లీకుమారులు కలిసి ఆస్తి తమ పేరిట రాసివ్వాలని రమేష్‌ను డిమాండ్ చేశారు. ఇందుకు రమేష్ ఒప్పుకోకపోవడంతో వారం రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేశారు. ఆదివారం రమేష్ అరుపులు విన్న స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు.
 
దీంతో రమేష్‌ను బంధువు గోపాల్ ఈరోడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు భార్య కుమారుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments