Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు తీవ్రవాదుల హతం

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:56 IST)
ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాటంలో తలమునకలై ఉంటే.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించే ప్రయత్నాల్లో ఉందని ఇటీవల ఆర్మీ చీఫ్ నరవాణే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 
 
కశ్మీర్‌లో బుధవారం ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

దక్షిణ కశ్మీర్‌ సోఫియాన్ జిల్లా మెల్‌హెరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం రాత్రి అక్కడకు చేరుకున్నాయి.

ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ముష్కరులు సైన్యంపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమయిన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి.

ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. వీరంతా అన్సర్ ఘజావత్ ఉల్ హింద్ తీవ్రవాద సంస్థకు చెందినవారు. ఎన్‌కౌంటర్‌లో ఆ సంస్థ టాప్ కమాండర్ కూడా హతమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments