ఎల్లుండి నుంచి అమెరికాలో లాక్‌డౌన్‌ సడలింపు?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:51 IST)
కరోనా మరణాలు బెంబేలెత్తిస్తున్నా అమెరికా తగ్గనంటోంది. ఎల్లుండి నుంచి లాక్ డౌన్ సడలింపుకు సిద్ధమవుతోంది. జార్జియా రాష్ట్రంలో శుక్రవారం నుండి జిమ్‌లు, హెయిర్‌ సెలూన్‌ వంటి చిరు వ్యాపారాలను పున్ణప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ బ్రియాన్‌ కెంప్‌ ప్రకటించారు.

వ్యాపారాలు పునరుద్ధరించినా, భౌతిక దూరం నిబంధన పాటించాలని ఆయన సూచించారు. జార్జియా బాటలోనే సౌత్‌ కరోలినా, టెన్నెస్సీ, ఇలినాయిస్‌, లూసియానా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నాయి. న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.

వ్యాపారాలు పున్ణప్రారంభమైతే రాష్ట్రం అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వుంటుందన్నారు. కరోనా మహమ్మారి అత్యంత వేగంగా దేశాన్ని కమ్ము కుంటున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ల సడలింపునకు సిద్ధం కావటంపై వైట్‌హౌస్‌ వైద్యాధికారి డా.ఆంథోనీ ఫౌసి లాక్‌డౌన్‌ల తొలగింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

తొందరపాటుతో వ్యవహరిస్తే ఎదురు తిరిగే ప్రమాదం వుందని హెచ్చరించారు. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ తాజా లెక్కల ప్రకారం అమెరికా దేశవ్యాప్తంగా కరోనా కేసులు సోమవారం నాటికి 7,84,000 దాటగా మరణాల సంఖ్య 42 వేలు దాటినట్లు తెలుస్తోంది.

ఈ మహమ్మారికి కేంద్ర స్థానంగా వున్న న్యూయార్క్‌ రాష్ట్రంలో 2,53,000 కేసులు, 18 వేల మరణాలు నమోదయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments