Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జమ్ముకశ్మీర్​లో 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు పునరుద్ధరణ

జమ్ముకశ్మీర్​లో 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు పునరుద్ధరణ
, శనివారం, 25 జనవరి 2020 (17:52 IST)
జమ్ముకశ్మీర్​లో అంతర్జాల సేవలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. దాదాపు ఐదు నెలలుగా నిలిచిపోయిన 2జీ మొబైల్​ ఇంటర్నెట్​ సేవలు ఇవాళ్టి నుంచి ప్రీపెయిడ్, పోస్ట్​ పెయిడ్​ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

జమ్ముకశ్మీర్​లో దాదాపు 5 నెలల క్రితం నిలిచిపోయిన ప్రీపెయిడ్​, పోస్ట్​ పెయిడ్​ 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 2జీ ఇంటర్నెట్​ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

అయితే ప్రభుత్వం ఆమోదించిన 301 వెబ్​సైట్లను మాత్రమే వినియోగించేందుకు వీలుంటుందని జమ్ముకశ్మీర్​ హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్​ వ్యాలీ వాసులకు మరికొద్దిరోజులు సామాజిక మాధ్యమాలను దూరంగా ఉంచుతున్నట్లు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు దీక్షపై వైకాపా దాడి : రైతుపై చేయి వేసినవాడు నాశనమే : నారా లోకేశ్