Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ఈశాన్య రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (16:51 IST)
ఈశాన్య భారతంలోని మూడు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం త్రిపుర అసెంబ్లీకి వచ్చే నెల 16వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 
 
ఈ మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన చేపట్టి, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, ఈ మూడు రాష్ట్రాలకు 60 చొప్పున అసెంబ్లీ సీట్లు ఉండగా, అన్నింటికీ ఒకే దశలో పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లుచేస్తున్నారు. 
 
సీఈసీ రాజీవ్ కుమార్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, మూడు రాష్ట్రాల్లో భౌగోళికంగా సవాళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ఆ మూడు రాష్ట్రాల్లో పర్యటించి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో చర్చలు జరిపారు. ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలో చోటు చేసుకోకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించాం అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments