Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలో లోక్‌సభ షెడ్యూల్ - ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (09:01 IST)
వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా సారథ్యంలో ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందుకోసం వచ్చే వారంలో సీఈసీ సునీల్ అరోరా సారథ్యంలోని ఎన్నికల సంఘం వచ్చేవారంలో సమావేశంకానుంది. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలతో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. దీనిపై ఈసీ కసరత్తులు చేయాల్సివుంది. 
 
ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు అవసరమైన భద్రతా సిబ్బంది తరలింపు, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చే పండగలు, ఇతర ముఖ్యమైన రోజులను పరిగణనలోకి తీసుకుని పలు తేదీలను ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ 2014 మార్చి 5వ తేదీన విడుదల కాగా, ఎన్నికలు 9 విడతలుగా ఏప్రిల్‌ 7 - మే 12వ తేదీల మధ్య నిర్వహించారు. 
 
అలాగే, ఈ దఫా కూడా ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలను విడుతల చేసి ఏప్రిల్‌ 10వ నుంచి మే 10వ తేదీలోపు మొత్తం 9 దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం ఉంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments