Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ఇంట్లో 10 వేల విదేశీ వాచ్‌లు... రోజుకొకటి పెట్టుకున్నా 27 యేళ్లపాటు...

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల మేరకు దోచుకుని విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక మోసగాడు నీరవ్ మోడీ. ఈయన చేసిన స్కామ్ బయటపడక ముందు దర్జా జీవితాన్ని అనుభవించినట్టు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరే

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (13:38 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల మేరకు దోచుకుని విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక మోసగాడు నీరవ్ మోడీ. ఈయన చేసిన స్కామ్ బయటపడక ముందు దర్జా జీవితాన్ని అనుభవించినట్టు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), సీబీఐ అధికారుల తనిఖీల్లో బహిర్గతమవుతోంది. 
 
ముఖ్యంగా, మోడీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేయగా, దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మొన్ననే రూ.వంద కోట్ల విలువైన విదేశీ కార్లను సీజ్ చేసిన అధికారులు.. ఇప్పుడు ఆయన ఇంట్లోని ఓ గదిలో ఉన్న వాచీలను చూసి షాక్ అయ్యారు. ఇంట్లోని రెండు గదుల్లో 10 వేల విదేశీ వాచీలను గుర్తించారు. ఒక్కో వాచీ ఖరీదు రూ.లక్షల్లో ఉంటుంది. 
 
ఈ వాచీలను రోజుకో వాచీ పెట్టుకున్నా.. అన్నీ వాచీలు పెట్టుకోవటానికి 27 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ వాచీలను 60 ప్లాస్టిక్ కంటైయినర్లలో భద్రపరిచి ఉంచారు. ఈ వాచీల మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని.. ఇన్ని వాచీలను ఎందుకు తెచ్చారో విచారణలో తేలాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments