Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి రోజు 10 గంటల విచారణ - రెండో రోజు 11 గంటలు... నేడు కూడా

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (09:16 IST)
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడో రోజు అయిన బుధవారం కూడా విచారణ జరుపనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సోమవారం నుంచి వరుసగా విచారణకు హాజరవుతున్నారు. 
 
రెండో రోజైన మంగళవారం ఏకంగా 11 గంటల పాటు విచారణ జరిగింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి బ్రేక్ ఇచ్చారు. భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం 4.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి రాత్రి 11.30 గంటల వరు ఏకబిగువున రాహుల్ వద్ద విచారణ జరిగింది. 
 
రెండు రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు రాహుల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చినట్టు సమాచారం. అంటే ఈ లిఖిత పూర్వక సాక్ష్యాధారాలుగా ఈడీ అధికారులు పరిగణించే దిశగా ఈడీ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. 
 
అంతేకాకుండా, మూడో రోజైన బుధవారం కూడా ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారణకు రావాలని ఆదేశించారు. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత ఈ మేరకు వారు రాహుల్‌కు స్వయంగా సమన్లు అందజేశారు. ఫలితంగా ఆయన మంగళవారం కూడా ఈడీ కార్యాలయానికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments