ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలు : సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (13:58 IST)
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు చెందిన విద్యార్థులకు వార్షిక ఆదాయంగా 8 లక్షల పరిమితిని విధించామని, దాన్ని పెంచొద్దని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. 
 
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే ప్రస్తుత విద్యా సంవత్సరానికి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అమలు చేస్తామని పేర్కొంది. ముఖ్యంగా నీట్ రాసిన విద్యార్థులకు ప్రవేశాలు, కాలజీలను కేటాయిస్తున్న తరుణంలో నిబంధనలు మార్చడం వల్ల సమస్యలు ఏర్పడతాయని పేర్కొంది. సవరించిన నిబంధనలను వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపింది. 
 
నిజానికి సవరించిన నిబంధనల్లో రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని కేంద్రం సర్కారు కొనసాగించింది. వ్యవసాయ భూమి ఐదు ఎకరాల కంటే అంతకుమించి ఎక్కువ ఉన్న వారిని మినహాయించింది. రూ.8 లక్షల ఆదాయ పరిమితిని క్రితం విచారణ సందర్భంగా కేంద్రం సమర్థించుకుంది. 
 
అయితే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి ఆదాయం, మెట్రో ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఆదాయంతో ఎలా ముడిపెడతారంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో నిబంధనలు సవరిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే, ఇపుడు సవరించిన నిబంధనలను వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామంటూ కోర్టుకు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments