Webdunia - Bharat's app for daily news and videos

Install App

9న రాష్ట్రపతికి ఆర్థిక సంఘం నివేదిక

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:34 IST)
పదిహేనవ ఆర్థిక సంఘం తన నివేదికను నవంబరు 9వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుందని తెలిపింది.

కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ నివేదికపై కూలంకషంగా చర్చించారు. నివేదికకు తుదిమెరుగులు దిద్దారు. నివేదికపై ఎన్‌కే సింగ్‌, సభ్యులు అజరు నారాయణ్‌ ఝా, అనూప్‌ సింగ్‌, అశోక్‌ లహిరి, రమేష్‌ చంద్‌ సంతకం చేశారు.

రాష్ట్రపతికి తమ నివేదిక సమర్పించడానికి కమిషన్‌ సమయం కోరిందని, అన్ని అంశాలపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత నివేదికను నవంబరు 9వ తేదీన సమర్పిస్తామని రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు ఆ ప్రకటన తెలిపింది.

కమిషన్‌ తన నివేదిక కాపీని ప్రధాని నరేంద్రమోడీకి కూడా సమర్పిస్తుందని వివరించింది. ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సిఫార్సులు నివేదికలో ఉంటాయి. ఈ నివేదికను కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటుకు సమర్పిస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలతో వివిధ స్థాయిల్లో కమిషన్‌ సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపి నివేదికను ఖరారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments