Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉఖ్రుల్ పట్టణానికి సమీపంలో భూకంపం... భూకంప లేఖినిపై 4.6గా నమోదు..

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (08:12 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌ రాష్ట్రంలోని ఉఖ్రుల్ పట్ణానికి 208 కిలోమీటర్ల దూరంలో మయన్మార్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భూకంప లేఖినిపై 4.6గా నమోదైంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూమికి 120 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన రెండో భూకంపం ఇదేనని తెలిపింది. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం 1.47 గంటల సమయంలో అస్సాంలోని డిబ్రూఘర్‌కు 226 కిలోమీటర్ల దూరంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. 
 
కాకాగా, భారత భూకంప జోన్ మ్యాచ్ ప్రకారం మణిపూర్ రాష్ట్రం హై రిస్క్ సీస్మిక్ జోన్-5లో ఉంది. భౌగోళిక నిర్మాణం, స్థానం కారణంగా ఈ రాష్ట్రంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. సెప్టెంబరులో కూడా ఉఖ్రుల్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. అయితే, దీని తీవ్రత పెద్దగా లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు. అలాగే, తాజాగా భూకంపం వల్ల కలిగిన నష్టం ఇతర వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments