Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉఖ్రుల్ పట్టణానికి సమీపంలో భూకంపం... భూకంప లేఖినిపై 4.6గా నమోదు..

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (08:12 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌ రాష్ట్రంలోని ఉఖ్రుల్ పట్ణానికి 208 కిలోమీటర్ల దూరంలో మయన్మార్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భూకంప లేఖినిపై 4.6గా నమోదైంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూమికి 120 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన రెండో భూకంపం ఇదేనని తెలిపింది. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం 1.47 గంటల సమయంలో అస్సాంలోని డిబ్రూఘర్‌కు 226 కిలోమీటర్ల దూరంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. 
 
కాకాగా, భారత భూకంప జోన్ మ్యాచ్ ప్రకారం మణిపూర్ రాష్ట్రం హై రిస్క్ సీస్మిక్ జోన్-5లో ఉంది. భౌగోళిక నిర్మాణం, స్థానం కారణంగా ఈ రాష్ట్రంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. సెప్టెంబరులో కూడా ఉఖ్రుల్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. అయితే, దీని తీవ్రత పెద్దగా లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు. అలాగే, తాజాగా భూకంపం వల్ల కలిగిన నష్టం ఇతర వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments