Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున వరుస భూకంపాలు.. వణికిపోయిన జనాలు

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (14:41 IST)
దీపావళి రోజున వరుస భూకంపాలు జనాలను వణికించాయి. వరుస భూ కంపాలు అస్సాంతో పాటు ఈశాన్య రాష్ర్టాలను నిలువెల్లా వణికించాయి. పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతినగా… ప్రజలు ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు.
 
ప్రకంపనల సమయంలో వేర్వేరుచోట్ల ఒకరు షాక్‌తో, మరొకరు గుండెపోటుతో మరణించారు. నాలుగు జిల్లాల్లో 10 మంది గాయపడ్డారు. అస్సాంలోని సోనిత్‌పూర్‌ జిల్లా ప్రధాన కేంద్రమైన తేజ్‌పూర్‌లో బుధవారం ఉదయం 7.51 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దాని తీవ్రత 6.4గా నమోదైంది. 
 
దాని ప్రభావం ఈశాన్యంతో పాటు పశ్చిమ బెంగాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. దీని తర్వాత మధ్యాహ్నంలోపు మరో 10 భూకంపాలు సంభవించాయి. వాటి తీవ్రత మొదటిదాని కంటే తక్కువగానే నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి భూకంప ప్రభావంపై ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments