Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే మాజీ మంత్రిపై ఏసీబీ పంజా - ఏకకాలంలో 69 చోట్ల తనిఖీలు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (10:00 IST)
తమిళనాడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో మాజీ మంత్రిని టార్గెట్ చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తంగమణి నివాసం, కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల గృహాలతోపాటు మొత్తం 69 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలకు దిగారు. 
 
గత పదేళ్ళకాలంలో మంత్రిగా కొనసాగిన తంగమణి తాను సంపాదించిన అవినీతి సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో భారీగా పెట్టుబడులుగా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 
 
బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ తనిఖీలు ఏకంగా 69 ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దిండిగల్, మదురైతో సహా మొత్తం 69 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. 
 
అలాగే, కర్నాటక రాష్ట్రంలోని ఐదు చోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఇప్పటికి కీలమైన పత్రాలతో పాటు.. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments