Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై టి.నగర్ హోటల్లో డచ్ యువతి శవం... చంపేశారా? చచ్చిపోయిందా?

చెన్నైలోని టి.నగర్ లోని ప్రముఖ హోటల్లో డచ్ యువతి శవమై తేలడం చర్చనీయాంశమైంది. తను బస చేసిన హోటల్ గదిలో 24 ఏళ్ల డచ్ యువతి విగత జీవిగా మారింది. గురువారంనాడు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:39 IST)
చెన్నైలోని టి.నగర్ లోని ప్రముఖ హోటల్లో డచ్ యువతి శవమై తేలడం చర్చనీయాంశమైంది. తను బస చేసిన హోటల్ గదిలో 24 ఏళ్ల డచ్ యువతి విగత జీవిగా మారింది. గురువారంనాడు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
టి.నగర్లోని వెంకటేశన్ స్ట్రీట్‌లో వున్న ఓ ప్రముఖ హోటలకి ఆమె సోమవారం వచ్చారు. తన పేరు లిండా ఐరెన్ హీజ్రెకర్ అనీ, తను ఓ జర్నలిస్టునని పరిచయం చేసుకుంది. గురువారం ఉదయం తను వెళ్లిపోతానని చెప్పింది. ఐతే మధ్యాహ్నం 12 దాటినా ఆమె గది తలుపులు తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది డూప్లికేట్ తాళాలతో గది తలుపులు తెరిచి చూడగా ఆమె శవమై కనిపించింది. 
 
వెంటనే విషయాన్ని మాంబళం పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని ప్రాధమికంగా తేల్చారు. ఆమె బెడ్ పైన పొడిలాంటి పదార్థాన్ని కనుగొన్నారు. ఐతే ఆమెది ఆత్మహత్యా లేదంటే హత్యా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శవాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వాస్తవాలు వెలికి వస్తాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments