Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్లో అర్థరాత్రి మహిళా ప్రయాణికురాలి తలపై మూత్ర విసర్జన చేసిన టీసీ!

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (14:29 IST)
అమృతసర్ నుంచి కోల్‌కతా వెళుతున్న అకాల్ తఖ్తత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి తలపై టీసీ ఒకరు మూత్ర విసర్జన చేశాడు. బాధితురాలు తన భర్త రాజేశ్ కుమార్‌తో కలిసి కోల్‌కతా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని మున్నా కుమార్‌గా గుర్తించారు. పీకల వరకు మద్యం సేవించిన టీసీ మున్నాకుమార్... ఈ పాడుపనికి పాల్పడ్డాడు. బాధితారులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
టీసీ చేసిన పాడుపనికి ఆ మహిళా ప్రయాణికురాలు బిగ్గరగా కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు నిద్రలేచి, పారిపోతున్న టీసీని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ఇటీవలి కాలంలో విమానంలో పలువురు ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని మరచిపోకముందే రైలులో ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments