Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్.. ఎలా?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (13:12 IST)
భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంపంలో అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్ నిలిచింది. భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిసైల్స్‌ను ఒడిశా తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఒరిస్సా తీరం నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ పరీక్షతో భారత రక్షణ రంగం మరింత బలోపేతమైనట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. 
 
ఈ మిస్సైల్‌ను వివిధ రకాల పేలోడ్లను మోసుకెళ్లేలా దీనిని డిజైన్ చేశారు. ఇది 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలదు. ఈ విజయంతో క్రిటికల్, అడ్వాన్స్‌డ్ మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల చెంత భారత్ చేరినట్టు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇదొక చారిత్రక ఘట్టమని, ఈ విజయంతో అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
పరీక్ష అనంతరం మిసైల్ గమనాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి సేకరించిన ఫ్లైట్ డేటా.. క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు నిర్ధారించిందని డీఆర్డీవో ప్రకటించింది. ఈ క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ డీఆర్డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ పార్టనర్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించారు. డీఆర్డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, రక్షణ దళాల అధికారుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు డీఆర్డీవో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments