Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే'.. కొడుకు క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (12:33 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న కుమారుడుని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేశాడో కన్నతండ్రి. స్కూలుకు సరిగా వెళ్ళలేదు కాదు కాదా.. మొబైల్ ఫోన్ రిపేరు చేయించుకునేందుకు డబ్బుులు అడగడంతో ఆ తండ్రికి కోపం నషాళానికి ఎక్కింది. చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి స్కూలుకు పంపిస్తుంటే, స్కూలుకు వెళ్లకుండా నువ్వు చేస్తున్నదేంటని అడుగుతూ కొట్టడం మొదలు పెట్టాడు. కోపంలో విచక్షణ మరిచిపోయి క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టాడు. గోడకేసి కొట్టడంతో కొడుకు తల పగిలింది. తీవ్ర గాయాల కారణంగా ఆ బాలుడు అక్కడే చనిపోయాడు. శుక్రవారం ఉదయం ఈ విషాదకర ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. 
 
పోలీసుల కథనం మేరకు.. కాప్నినగర్‌‍కు చెందిన రవికుమార్ (40) కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య శశికళ, కొడుకు తేజస్ (14) ఉన్నారు. తేజస్ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే, క్లాసులకు సరిగా వెళ్లకుండా ఎప్పుడు చూసినా మొబైల్‌తో ఆటలాడుతూ కనిపిస్తున్నాడని రవికుమార్ కొడుకును తిడుతుండేవాడు. 
 
తాము కష్టపడి చదివిస్తుంటే కొడుకు చదువును నిర్లక్ష్యం చేయడం తట్టుకోలేకపోయేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మొబైల్ ఫోన్ రిపేర్ కోసం డబ్బులు కావాలని అడిగిన తేజస్‌పై రవికుమార్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇంట్లోని క్రికెట్ బ్యాట్‌తో కొడుకును కొట్టాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్యపైనా మండిపడ్డాడు. 
 
అప్పటికీ కోపం తగ్గక 'నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే' అంటూ కొడుకు తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి తేజస్ స్పృహ కోల్పోయాడు. కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రవికుమార్ అడ్డుకున్నాడు. తేజస్‌ను అలాగే వదిలేసి కాసేపటి తర్వాత బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికి లేవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో శశికళ తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లింది.
 
అయితే, గాయాలు, రక్తస్రావం కారణంగా తేజస్ అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ఆసుపత్రికి వచ్చిన రవికుమార్.. కొడుకుది సాధారణ మరణమేనని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసి శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి రవికుమార్‌‍ను అదుపులోకి తీసుకున్నారు. తేజస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments