Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయ కండువా కప్పుకున్న పెరియార్ మనవడు..

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (10:45 IST)
సామాజిక ఉద్యమనేత, ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన పెరియార్‌ మనవడే సతీశ్ కృష్ణ కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. పెరియార్‌ నేలపై బీజేపీ ఎప్పటికీ బలపడలేదని డీఎంకే వ్యాఖ్యలను చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే, స్వయంగా పెరియార్ మనవడే బీజేపీలో చేరడం డీఎంకేకు గట్టి సవాల్ అని చెప్పాలి. ఇటీవల డీఎంకే ఎమ్మెల్యే కూకా సెల్వం ప్రధానిని ప్రశంసిస్తూ.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. 
 
కాగా డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం ప్రధాని నరేంద్ర మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించడం ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్‌కి రుచించలేదు. దీంతో ఆయనతో అన్ని రకాల సంబంధాలను తెంచుకున్న డీఎంకే.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
 
త్వరలో సెల్వం కూడా మిగతా ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో పాటు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. సెల్వం ఇప్పటికే బీజేపీ నేతలు మరళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్‌లతో పాటు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కూడా కలుసుకున్నట్టు సమాచారం.
 
తమిళనాడులోని రెండు ప్రాంతీయ పార్టీల్లో అసమ్మతి నేతలు తమ పార్టీలోకి చేరేందుకు మార్గం సుగమం అయ్యిందంటూ కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల మొదట్లో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments