Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్ వి.శాంత మృతి

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (09:39 IST)
Dr V Shanta
అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌, సీనియర్‌ అంకాలజిస్టు డాక్టర్‌ వీ శాంత (94) తుదిశ్వాస విడిచారు. వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఉచితంగా సేవలందించిన శాంత వైద్య వృత్తికి వన్నె తెచ్చారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తీవ్ర ఛాతీ నొప్పికి గురైన ఆమెను కుటుంబ సభ్యులు అపోలో దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంత భౌతికకాయాన్ని పాత క్యాన్సర్‌ దవాఖాన ఆవరణకు తరలించారు.
 
ఈ దవాఖానను ఆమె తన గురువు డాక్టర్ కృష్ణమూర్తితో కలిసి నిర్మించారు. దేశవ్యాప్తంగా పేదలకు క్యాన్సర్‌ చికిత్స అందించడంలో డాక్టర్‌ శాంత ఎనలేని కృషి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆమె సహాయ సహకారాలు అందించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments