Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

భీమడోలులో వింత వ్యాధి ... ఉన్నట్టుండి పడిపోతున్న ప్రజలు

Advertiesment
Andhra Pradesh
, మంగళవారం, 19 జనవరి 2021 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ఓ వింత వ్యాధి వెలుగు చూసింది. ఈ ప్రాంత వాసులు ఉన్నట్టుండి ఠపీమని కిందపడిపోతున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఈ మండలంలోని పూళ్ల గ్రామంలో కొంతమంది ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. అలా మొత్తం 16 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కొందరిలో మూర్ఛ లక్షణాలు కూడా కనిపించడంతో ఏలూరు ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. 
 
బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆహారం విషతుల్యం కావడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కాగా, ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ ఇలానే జరిగింది. స్థానికులు కొందరు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. సమీపంలోని రసాయన పరిశ్రమ అర్ధరాత్రి విడిచిపెట్టే వ్యర్థాల వల్లే ఇలా జరిగిందని తేలింది. 
 
అలాగే, తెలంగాణలోని మహబూబాబాద్ మండలం అయోధ్య శివారు భజనతండాలోనూ ఇలాంటి వింత వ్యాధి కొన్ని రోజులపాటు స్థానికులను వణికించింది. వాంతులు, విరేచనాలతో 130 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యూటీషియన్‌తో లింకు .. సూసైడ్ చేసుకున్న ఎస్ఐ.. ఎక్కడ?