భారతీయులు ఏమైనా సాధించగలరు.. మోదీనే నిదర్శనం: డొనాల్డ్ ట్రంప్

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (15:14 IST)
Donald trump_Modi
నమస్తే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మోదీ తన స్నేహితుడని చెప్పేందుకు గర్విస్తున్నానని తెలిపారు. ‘నమస్తే ట్రంప్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కూడా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానిస్తూ.. 1.20 లక్షల మందిని ఒకేచోట చూడడం ఆనందంగా ఉందన్నారు. ''మా హృదయంలో ఎప్పుడూ భారత్‌కు ప్రత్యేక స్థానం వుందని, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మోదీకి కృతజ్ఞతలన్నారు. 60 కోట్లమంది ఓటర్లు మోడీకి తమ హృదయాల్లో చెరగని ముద్ర వేశారని.. ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
చాయ్‌వాలా నుంచి నరేంద్ర మోదీ ఎదిగారు. గత ఏడాది మోడీ అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. మోడీ, గుజరాతే కాదు.. దేశం గర్వించదగ్గ నేత.. అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. భారతీయులు ఏమైనా సాధించగలరు అనడానికి మోడీయే నిదర్శనం.. అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. 
 
ఇంకా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉగ్రవాద కార్య కలాపాలకు స్వస్తి పలికామని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ''చచ్చిపోయింది'' అని వ్యాఖ్యానించారు. టెర్రరిజం అన్నది గ్లోబల్ సమస్య అని, ఈ బెడదను తుదముట్టించేందుకు భారత, అమెరికా దేశాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని హామీ ఇచ్చారు. 
 
బాగ్దాద్, సిరియా వంటి దేశాల్లో ఈ ''తీవ్రవాదం'' ఇంకా పెఛ్చరిల్లుతోందని, దీన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము పలు చర్యలు చేపట్టామని ట్రంప్ అన్నారు. సోమవారం ప్రధాని మోడీతో కలిసి అహ్మదాబాద్‌లోని అతి పెద్ద మోతేరా స్టేడియంలో.. భారీ సంఖ్యలో హాజరైన ప్రజాసభలో మాట్లాడిన ట్రంప్.. రక్షణ రంగంలో భారత, అమెరికా దేశాలు సహకరించుకుంటున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments