Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ రైళ్లు కాదు.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వండి : అఖిలేష్ యాదవ్

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:58 IST)
దేశానికి కావాల్సింది బుల్లెట్ రైళ్లు కాదనీ, సరిహద్దులను కంటికి రెప్పలా కాస్తున్న సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశానికి బుల్లెట్ రైళ్లు అవ‌స‌రం లేద‌న్నారు. కానీ, సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులతో దేశ రక్షణలో ఉండే పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాల‌న్నారు. 
 
పూల్వామా ఉగ్రదాడికి దేశ నిఘా వ్యవస్థ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. ఇలా ఎందుకు తయారవుతుందని ఆయన ప్రశ్నించారు. అదేసమయంలో పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉందన్నారు. అన్ని పార్టీలు త‌మ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను ప‌క్క‌న‌పెట్టి, సుర‌క్షితమైన స‌రిహ‌ద్దు కోసం దీర్ఘ‌కాలిక వ్యూహాన్ని ర‌చించాల‌న్నారు. 
 
అదేసమయంలో దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన తొలిరోజే సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన అనంతరం వందే భారత్ రైలులో పొగలు వచ్చాయి. కోచ్‌లలో విద్యుత్ సమస్య తలెత్తిందని తెలిపారు. 
 
బ్రేకుల్లోనూ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలతో రైలు నిలిచిపోయిందన్నారు. అభివృద్ధి అంటూ వందేభారత్ గురించి చెబుతున్నారు. దేశంలో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. యువతకు ఉద్యోగాల్లేవ్. భద్రతావ్యవస్థ కుప్పకూలింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందంటూ అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments