Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ రైళ్లు కాదు.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వండి : అఖిలేష్ యాదవ్

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:58 IST)
దేశానికి కావాల్సింది బుల్లెట్ రైళ్లు కాదనీ, సరిహద్దులను కంటికి రెప్పలా కాస్తున్న సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశానికి బుల్లెట్ రైళ్లు అవ‌స‌రం లేద‌న్నారు. కానీ, సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులతో దేశ రక్షణలో ఉండే పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాల‌న్నారు. 
 
పూల్వామా ఉగ్రదాడికి దేశ నిఘా వ్యవస్థ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. ఇలా ఎందుకు తయారవుతుందని ఆయన ప్రశ్నించారు. అదేసమయంలో పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉందన్నారు. అన్ని పార్టీలు త‌మ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను ప‌క్క‌న‌పెట్టి, సుర‌క్షితమైన స‌రిహ‌ద్దు కోసం దీర్ఘ‌కాలిక వ్యూహాన్ని ర‌చించాల‌న్నారు. 
 
అదేసమయంలో దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన తొలిరోజే సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన అనంతరం వందే భారత్ రైలులో పొగలు వచ్చాయి. కోచ్‌లలో విద్యుత్ సమస్య తలెత్తిందని తెలిపారు. 
 
బ్రేకుల్లోనూ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలతో రైలు నిలిచిపోయిందన్నారు. అభివృద్ధి అంటూ వందేభారత్ గురించి చెబుతున్నారు. దేశంలో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. యువతకు ఉద్యోగాల్లేవ్. భద్రతావ్యవస్థ కుప్పకూలింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందంటూ అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments