Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల ఎంట్రీ ముఖ్యంకాదు.. లైంగిక వేధింపులను అడ్డుకోండి : తస్లీమా నస్రీన్

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (10:11 IST)
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలకు బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ చురకలు అంటించారు. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లాలని మహిళా కార్యకర్తలు ఎందుకంత ఆసక్తి చూపున్నారో తనకు అర్థంకావడం లేదన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు ఓ సూచన చేశారు. 
 
ఇదే విషయంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. "మీరంతా లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలపై పోరాడటానికి దృష్టిపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. మహిళా కార్యకర్తలు శబరిమలకు బదులు గ్రామాలకు వెళితే బాగుంటుందన్నారు. అక్కడ మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, గృహ హింస, లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి ఘటనలతో ఇబ్బందులు పడుతున్నారని వారికి అండగా నిలవాలని తస్లీమా నస్రీన్ కోరారు. బాలికలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ, సమాన వేతనాలు పొందడానికి అవకాశాలు లేని గ్రామాలకు వెళితే బాగుంటుందని హితవు పలికారు. 
 
శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 యేళ్ళ మధ్య వయసు మహిళలు వెళ్లేందుకు సుప్రీంకోర్టు గత సెప్టెంబరు 28వ తేదీన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, పలువురు మహిళలు ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివారిలో భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ కూడా ఉన్నారు. ఈమె శబరిమలకు వెళ్లేందుకు కోల్‌కతా నుంచి కొచ్చికి వెళ్లగా, ఆమెను అయ్యప్ప భక్తుల ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం