Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అందరూ శాకాహారులుగా మారాలనుకుంటున్నారా? సుప్రీం ప్రశ్న

మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ.. దాఖలైన పిల్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (10:27 IST)
మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ.. దాఖలైన పిల్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేగాకుండా దేశంలోని అందరూ శాకాహారులుగా మారాలని కోరుకుంటున్నారా? అంటూ జస్టిస్ మదన్ బి లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది.
 
కాగా, బుధవారం హిందూత్వ సంస్థలకు చెందిన పలువురు యువకులు ఢిల్లీ వీధుల్లో హల్ చల్ చేశారు. మాంసం దుకాణాలు మూసెయ్యాలంటూ హడావిడి చేశారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేవరకు మాంసం దుకాణాలు తెరిస్తే షాపులు ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. 
 
పాలెం విహార్, సూరత్ నగర్, అశోక్ విహార్, సెక్టార్ 5, 9, పటౌడీ చౌక్, జాకోబ్‌పురా, సదర్ బజార్, ఖద్సా అనాజ్ మండి, బస్టాండ్, డీఎల్ఎఫ్ ప్రాంతం, సోహ్నా, సెక్టార్ 14 సహా పలు చోట్ల షాపులు బలవంతంగా మూసివేయించినట్టు తెలుస్తోంది. కొందరు మాంసం వ్యాపారులు మాట్లాడుతూ, శివసేన కార్యకర్తలు తమ షాపులను బలవంతంగా మూయించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాంసాహార నిషేధంపై వేసిన పిల్‌పై సుప్రీం పై విధంగా  స్పందించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments