శరద్ పవార్ వారసురాలివి నీవే సుప్రియా : డిగ్గీరాజా

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (15:34 IST)
మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠా యోధుడుగా గుర్తింపు పొందిన నేత శరద్ పవార్. ఇంతకాలం ఈయన వారసుడు ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ అని ప్రతి ఒక్కరూ భావిస్తూ వచ్చారు. కానీ, ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల ఇపుడు ఆయన ఏకాకి అయ్యారు. 
 
ఎన్సీపీని చీల్సి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కలలుగన్నాడు. దీంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రిపదవిని బీజేపీ ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌తో ఉబ్బితబ్బిబ్బులైన అజిత్ పవరా తెల్లారేసరికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 
 
ఎన్సీపీని మోసం చేస్తూ అజిత్ పవార్ సొంత నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే అజిత్ పవార్‌పై ఆ పార్టీ అధిష్టానం వేటువేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక శరద్ పవార్ రాజకీయ వారసురాలు ఆయన కూతురు సుప్రియా సూలెనే అంటూ ట్వీట్ చేశారు.
 
'ఎన్సీపీ నుంచి గెలిచిన 54 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు. అజిత్ పవార్ ఒంటరి అయ్యారు. ఇప్పుడు శరద్ పవార్ వారసురాలివి నువ్వే సుప్రియ సూలె' అంటూ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments