Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై మురికి వాడ పరిశుభ్రం.. అయినా 33 కరోనా కేసులు

Webdunia
గురువారం, 14 మే 2020 (18:57 IST)
ధారావిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ధారావిలో మరో 33 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కరోనా మహమ్మారి గత నెల మొదటి వారంలో 10 కేసులతో మొదలై ఆ తర్వాత వేగంగా విస్తరించింది. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
ముంబై మురికి వాడను పూర్తిగా పరిశుభ్రం చేశారు. అన్ని ఇళ్లలో శానిటైజింగ్ నిర్వహించారు. బాధితులను గుర్తించి క్వారెంటైన్‌కు తరలించారు. అధికారులు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. గురువారం నమోదైన 33 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. కాగా, గురువారం ధారావిలో కొత్తగా రెండు మరణాలు కూడా సంభవించాయి.
 
మరోవైపు కరోనా వేగంతో దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి‌. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. టెస్టింగ్‌ సామర్థం పెరగడంతో పాటు వైరస్‌ సోకే వారి సంఖ్య కూడా పెరిగింది. వలస కార్మికుల రాకతో రాష్ట్రాల్లో కొత్త కేసులు రికార్డవుతున్నాయి‌.
 
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3వేల 722 కొత్త కేసులు నమోదయ్యాయి‌. 134 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78 వేల మార్కుకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments