Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై మురికి వాడ పరిశుభ్రం.. అయినా 33 కరోనా కేసులు

Webdunia
గురువారం, 14 మే 2020 (18:57 IST)
ధారావిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ధారావిలో మరో 33 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కరోనా మహమ్మారి గత నెల మొదటి వారంలో 10 కేసులతో మొదలై ఆ తర్వాత వేగంగా విస్తరించింది. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
ముంబై మురికి వాడను పూర్తిగా పరిశుభ్రం చేశారు. అన్ని ఇళ్లలో శానిటైజింగ్ నిర్వహించారు. బాధితులను గుర్తించి క్వారెంటైన్‌కు తరలించారు. అధికారులు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. గురువారం నమోదైన 33 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. కాగా, గురువారం ధారావిలో కొత్తగా రెండు మరణాలు కూడా సంభవించాయి.
 
మరోవైపు కరోనా వేగంతో దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి‌. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. టెస్టింగ్‌ సామర్థం పెరగడంతో పాటు వైరస్‌ సోకే వారి సంఖ్య కూడా పెరిగింది. వలస కార్మికుల రాకతో రాష్ట్రాల్లో కొత్త కేసులు రికార్డవుతున్నాయి‌.
 
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3వేల 722 కొత్త కేసులు నమోదయ్యాయి‌. 134 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78 వేల మార్కుకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments