Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిస్తున్న డెంగీ ఫీవర్ : 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు!

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (15:19 IST)
దేశంలోని పలు రాష్ట్రాల్లో డెంగీ దోమ కలవరపెడుతోంది. గతకొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీల్లో అనేక మంది డెంగీ జ్వరం బారిపడుతున్నారు. వీరిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. 
 
దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. డెంగీ నివారణకు సాంకేతిక సహాయం అందించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు ఈ బృందాలు సూచనలు చేయనున్నాయి.
 
దేశరాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్‌, కేరళ, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ)తోపాటు నేషనల్‌ వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం నిపుణులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు. 
 
ముఖ్యంగా డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించడంతో పాటు వ్యాధి కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకోనున్నారు. ఈ సమయంలో రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు పలు జాగ్రత్తలను వివరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments