Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో హోంశాఖ కీలక చర్యలు... కనిపిస్తే కాల్చివేత

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (12:47 IST)
ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 13 మంది  ప్రాణాలు కోల్పోవడం. అల్లరిమూకల తుపాకీ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయాలపాలు కావడం, 48 మంది పోలీసులకూ గాయాలు అవడంతో స్పెషల్ పోలీస్ కమిషనర్‌గా 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఎస్ఎన్ శ్రీవాత్సను నియామించింది కేంద్ర హోం శాఖ. 
 
అంతేకాదు నాలుగు సున్నిత ప్రాంతాల్లో “షూట్ ఎట్ సైట్” ఉత్తర్వులు కూడా జారీ చేసారు ఢిల్లీ పోలీసులు. ఈశాన్య ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇళ్లను వదిలి బయటకు రాకూడదంటూ మైకుల్లో ప్రకటనలు చేస్తున్నరు పోలీసులు.
 
అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో బుధవారం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. పరిస్థితిని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా.
 
మరోవైపు టీవీ చానెల్స్‌‌కు సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రైవేట్ టీవీ చానెల్స్‌కు సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. మంగళవారం రాత్రి ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్ కింద ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్‌కు ఈ క్రింది సూచనలు చేసింది. 
 
కీలక సూచనలు ఇవే..
 
 దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా ప్రోగ్రామ్స్ ఉండకూడదు. అందుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయకూడదు. ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించ పర్చేలా ఉన్న వీడియోలు గానీ.. పదాలను గానీ టీవీ చర్చా కార్యక్రమాల్లో  ప్లే చేయకూడదు. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు.. ఆయా వ్యక్తుల భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదు.. అని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటనలో నిశితంగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం