Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో హోంశాఖ కీలక చర్యలు... కనిపిస్తే కాల్చివేత

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (12:47 IST)
ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 13 మంది  ప్రాణాలు కోల్పోవడం. అల్లరిమూకల తుపాకీ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయాలపాలు కావడం, 48 మంది పోలీసులకూ గాయాలు అవడంతో స్పెషల్ పోలీస్ కమిషనర్‌గా 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఎస్ఎన్ శ్రీవాత్సను నియామించింది కేంద్ర హోం శాఖ. 
 
అంతేకాదు నాలుగు సున్నిత ప్రాంతాల్లో “షూట్ ఎట్ సైట్” ఉత్తర్వులు కూడా జారీ చేసారు ఢిల్లీ పోలీసులు. ఈశాన్య ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇళ్లను వదిలి బయటకు రాకూడదంటూ మైకుల్లో ప్రకటనలు చేస్తున్నరు పోలీసులు.
 
అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో బుధవారం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. పరిస్థితిని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా.
 
మరోవైపు టీవీ చానెల్స్‌‌కు సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రైవేట్ టీవీ చానెల్స్‌కు సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. మంగళవారం రాత్రి ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్ కింద ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్‌కు ఈ క్రింది సూచనలు చేసింది. 
 
కీలక సూచనలు ఇవే..
 
 దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా ప్రోగ్రామ్స్ ఉండకూడదు. అందుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయకూడదు. ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించ పర్చేలా ఉన్న వీడియోలు గానీ.. పదాలను గానీ టీవీ చర్చా కార్యక్రమాల్లో  ప్లే చేయకూడదు. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు.. ఆయా వ్యక్తుల భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదు.. అని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటనలో నిశితంగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం