Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన కానిస్టేబుల్.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:48 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల ఓ కానిస్టేబుల్ అత్యంత కిరాతకంగా నడుచుకున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ గొడ్డలితో నరికి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఖర్‌ఖైదా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇన్‌స్పెక్టర్ బిజేంద్ర సింగ్ వెల్లడిస్తూ,  కానిస్టేబుల్ దీపక్(39) అతని ఇంటిలోని ఒక గదిలో అచేతనస్థితిలో కనిపించాడని, అలాగే అతని తల్లిదండ్రుల మృతదేహాలు కూడా అక్కడే లభ్యమయ్యాయని తెలిపారు. 
 
వారి వయసు 65 సంవత్సరాలు ఉండవచ్చని, వారి తలపై గొడ్డలితో మోదినట్లు గాయాలున్నాయని పేర్కొన్నారు. అలాగే దీపక్ గదిలో గొడ్డలి లభ్యమైంది. దానిపై రక్తం మరకలు ఉన్నాయని తెలిపారు. 
 
దీపక్ తన తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన తరువాత వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తర్వాత తాను విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియరాలేదన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments