Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా డెలివరీ ఏజెంట్‌కు కరోనా వైరస్.. 72 కుటుంబాల సంగతి? (video)

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:05 IST)
పిజ్జా డెలివరీ ఏజెంట్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. ఢిల్లీలో పిజ్జా డెలివరీ ఏజెంట్‌కు కరోనా వైరస్ సంక్రమించడంతో 72 కుటుంబాలను క్వారెంటైన్ చేశారు. ఆయా వ్యక్తులను ఇంట్లోనే క్వారెంటైన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ వారికి లక్షణాలు కనిపిస్తే, అప్పుడు కరోనా పరీక్షలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం లాక్ డౌన్ రెండో దశకు చేరుకుంది. మే మూడో తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. పిజ్జా బాయ్‌కు కరోనా సోకిన అంశంపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. పిజ్జా బాయ్‌తో లింకున్న మరో 17 డెలివరీ బాయ్స్‌ను ఇన్‌స్టిట్యూషనల్ క్వారెంటైన్‌లో పెట్టినట్లు వెల్లడించారు. 72 కుటుంబాలను మంది హోం క్వారెంటైన్‌లో పెట్టినట్లు వెల్లడించారు.
 
ఈ క్రమంలో న్యూఢిల్లీలోని మాలవీయ నగర్‌కు చెందిన 72 కుటుంబాలు 15 రోజులుగా తరచూ పిజ్జాను ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకుంటూ వచ్చారు. ఒకే ప్రాంతం కావడం వల్ల ఒకే వ్యక్తి ఆయా కుటుంబాలందరికీ పిజ్జాను డెలివరీ చేశారు. 
 
ఈ ఘటన చోటు చేసుకున్న మూడు రోజుల తరువాత.. ఆ వ్యక్తి అనారోగ్యానికి గురి అయ్యారు. ఆయనకు పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ డెలివరీ బాయ్ కరోనా వైరస్ పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని దక్షిణ ఢిల్లీ ప్రాంత మెజిస్ట్రేట్ బీఎం మిశ్రా తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments