మెడికల్ షాపుల్లో మద్యం విక్రయం.. యజమాని జైలుపాలు

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (10:29 IST)
లాక్‌డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, మందుల షాపులను రోజంతా తెరిచివుంచే వెసులుబాటువుంది. అయితే, ఓ మెడికల్ షాపు యజమానికి దురాశ పుట్టింది. లాక్‌డౌన్ సమయంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని భావించాడు. అదే అదునుగా భావించిన అతను.. మెడికల్ షాపులో మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ఇది చివరకు ఆ నోటా ఈ నోటా పడి పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు వచ్చి అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగపూర్, గణేష్‌పేట్ ప్రాంతంలో నిషాంత్ అలియాస్ బంటీ ప్రమోద్ గుప్తా(36) అనే వ్యక్తి ఓ మెడికల్ షాపును నడుపుతున్నాడు. ఈయన తన షాపులోనే మద్యం అమ, తన షాపులోనే బీర్ అమ్మకాలు ప్రారంభించాడు. అదీకూడా మంచినీళ్ల బాటిల్స్‌లో బీర్‌ను నింపి ఆయన అమ్మకాలు ప్రారంభించాడు. 
 
ఈ విషయం ఆనోటా, ఈనోటా పాకి, చివరకు పోలీసులకు చేరడంతో వారు ఆకస్మికంగా తనిఖీలు చేయపట్టారు. ఈ తనిఖీల్లో లీటర్ల కొద్దీ బీర్ లభించింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు. ఇదే కేసులో తప్పించుకున్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments