Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన జవాన్

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (08:53 IST)
ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతన్ని గమనించిన ఓ జవాను హుటాహుటిన సీపీఆర్ చేసి ఆ ప్రయాణికుడి ప్రాణాలు రక్షించారు. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఢిల్లీలోని నంగ్లోయ్‌ మెట్రో స్టేషన్‌లో అనిల్‌ కుమార్‌(58) అనే ప్రయాణికుడు మెట్రో స్టేషన్‌లో చెకింగ్‌ పాయింట్‌ దాటిన తర్వాత అకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఉత్తమ్‌కుమార్‌ సకాలంలో స్పందించి అతడికి కార్డియోపల్మనరీ రిససిటేషన్‌(సీపీఆర్‌) అందించడం ద్వారా ప్రాణాల్ని నిలబెట్టారు. 
 
ఈ ప్రక్రియ చేసిన వెంటనే ఆ ప్రయాణికుడు స్పృహలోకి రాగా.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో షేర్‌ చేయడంతో ఇది వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments