Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మహిళా డాక్టర్ దారుణ హత్య

Webdunia
బుధవారం, 1 మే 2019 (13:46 IST)
ఢిల్లీలో ఓ మహిళా వైద్యురాలు దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంటి పక్కనే ఉండే ఇద్దరు వ్యక్తులే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని రంజిత్‌ నగర్‌కు చెందిన ఓ మహిళ ఎంబీబీఎస్‌ చదివి మాస్టర్స్‌ కోసం ప్రిపేరవుతున్న గరీమా మిశ్రా అనే వైద్యురాలు విగతజీవిగా పడివుండటాన్ని పోలీసులు గుర్తించారు. 
 
ఆమె గొంతు కోసి హతమార్చినట్టు ఆనవాళ్లు లభించాయి. కాగా హత్య జరిగిన అనంతరం ఆమె పొరుగున ఉండే ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో హత్యతో వారికి సంబంధం ఉందనే అనుమానాలు బలపడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరితో ఆమె సన్నిహితంగా ఉండేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్నేహితుడు సైతం ఎండీ కోర్సుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments