Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీని చితక్కొట్టిన పోలీస్ అధికారి

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (13:24 IST)
ముఖానికి మాస్క్ ధరించలేదని ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని ప్రేమ్‌ నగర్‌ ప్రాంతంలో జరిగింది. మాస్క్‌ విషయమై అధికారికి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన వాగ్వాదం ఈ దాడికి దారితీసింది. 
 
ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం స్పష్టంచేసింది.
 
దుర్గాచౌక్‌ వద్ద జోగేంద్ర అనే కానిస్టేబుల్‌తోపాటు మరికొందరు పోలీసు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ ప్రకాష్‌ మాస్క్‌ ధరించని జోగేంద్రను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.
 
ఆ సమయంలో ఎస్‌హెచ్‌ఓ తనను లాఠీతో తీవ్రంగా కొట్టినట్లు సదరు కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికాయి ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments