Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీని చితక్కొట్టిన పోలీస్ అధికారి

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (13:24 IST)
ముఖానికి మాస్క్ ధరించలేదని ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని ప్రేమ్‌ నగర్‌ ప్రాంతంలో జరిగింది. మాస్క్‌ విషయమై అధికారికి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన వాగ్వాదం ఈ దాడికి దారితీసింది. 
 
ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం స్పష్టంచేసింది.
 
దుర్గాచౌక్‌ వద్ద జోగేంద్ర అనే కానిస్టేబుల్‌తోపాటు మరికొందరు పోలీసు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ ప్రకాష్‌ మాస్క్‌ ధరించని జోగేంద్రను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.
 
ఆ సమయంలో ఎస్‌హెచ్‌ఓ తనను లాఠీతో తీవ్రంగా కొట్టినట్లు సదరు కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికాయి ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments