Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా ... 72 కుటుంబాల సభ్యులకు వణుకు

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా ... 72 కుటుంబాల సభ్యులకు వణుకు
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:39 IST)
ఢిల్లీలో ఇంటింటికీ పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో అతను డెలివరీ చేసిన 72 కటుంబాలకు, అతనితో పాటు పనిచేసిన మిగిలిన బాయ్స్‌ను, పిజ్జా సెంటర్ స్టాఫ్‌ను అధికారులు క్వారంటైన్ చేశారు. ఈ ఘటనతో మాల్వియా నగర్ ప్రాంతంలో కలకలం రేగింది. ద‌క్షిణ ఢిల్లీలోని మాల్వియా న‌గ‌ర్‌ ప్రాంతంలో ప్ర‌ముఖ‌ పిజ్జా సంస్థ‌ ఓ రెస్టారెంట్ ను నిర్వహిస్తుండగా, ఓ యువకుడు అక్కడ డెలివ‌రీ బాయ్‌గా ప‌ని చేస్తున్నాడు.
 
డెలివరీ బాయ్ కరోనా లక్షణాలతో బాధపడుతూ ఉండటంతో, పరీక్షలు చేయించగా, అతనికి పాజిటివ్ వచ్చినట్టు బుధవారం నాడు తేలింది. అతను దగ్గు, జ్వరం, జలుబు ఉన్న సమయంలోనూ పిజ్జాలను డెలివరీ చేశాడని తెలుసుకున్న అధికారులు, అతన్ని ఆసుపత్రికి తరలించారు.
 
ఆపై అతనితో పాటు పనిచేసిన 16 మందిని, అతన్నుండి డెలివరీ అందుకున్న 72 కుటుంబాలను సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. కాగా, డెలివరీ సమయంలో పిజ్జా బాయ్, ముఖానికి మాస్క్ వేసుకునే ఉన్నాడని, కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు ప్రజలు పరుగు