Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమంతా నరకంలో జీవిస్తున్నాం... సీజేఐకు సివిల్స్ విద్యార్థి లేఖ

వరుణ్
సోమవారం, 29 జులై 2024 (16:31 IST)
తామంతా నరకంలో జీవిస్తున్నామని, ఢిల్లీ మున్సిపల్ అధికారుల అవినీతి కారణంగా కోచింగ్ సెంటర్ల యజమానులు ఇష్టారాజ్యంగా నడుచుకుంటా యధేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఓ సివిల్స్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. 
 
ఢిల్లీలో సంభవించిన వరదల కారణంగా ముగ్గురు సివిల్స్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. నగర అధికారులు, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్స్‌ విద్యార్థి అవినాశ్ ధూబే ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోని లోపాలను ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌కి లేఖ రాశాడు.
 
'ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ విద్యనభ్యసించడమనేది మా ప్రాథమిక హక్కు. నీటి ఎద్దడి, వరదల కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లితోంది. మాకు సురక్షితమైన వాతావరణం అవసరముంది. అప్పుడే నిర్భయంగా చదువుపై దృష్టి సారించగలం. దేశ అభివృద్ధిలో భాగమవ్వగలం' అని పేర్కొన్నాడు.
 
తమతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేలవమైన మౌలిక సదుపాయల గురించి వెల్లడించాడు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్షాలు పడినప్పుడల్లా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాడు. నిబంధనలను ఉల్లంఘించి బేస్‌మెంట్‌లను లైబ్రరీలుగా మార్చారని.. వారి నిర్లక్ష్యం వల్లే ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించాడు. తామంతా నరకంలో జీవిస్తున్నట్లు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థుల మరణాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments