Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్‌కు బాంబు బెదిరింపు పంపిన విద్యార్థి.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (14:11 IST)
ఓ విద్యార్థి ఒకడు తాను చదువుతున్న పాఠశాలకే బాంబు బెదిరింపుపంపాడు. పాఠశాలకు వెళ్లేందుకు మూడ్ లేకపోవడంతో ఈ పనికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలో చోటుచేసుకుంది. బాంబు పెట్టినట్టు బెదిరింపు రావడంతో స్కూల్ యాజమాన్యం స్కూల్ మొత్తానికి సెలవు ప్రటించింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్‌కు చెందిన 14 యేళ్ల బాలుడు శుక్రవారం పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కానీ, తల్లిదండ్రులు మాత్రం స్కూల్‍‌కు వెళ్ళాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపాడు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం చేయడంతో వారు వచ్చి స్కూల్ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈమెయిల్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇందులో ఆ పాఠశాలలో చదివే 14 యేళ్ల బాలుడే ఈ బెదిరింపులకు పాల్పడినట్టు తేలింది. పైగా, తాను పంపిన మెయిల్ నమ్మదగినదిగా ఉండేందుకు వీలుగా మరో రెండు పాఠశాలలకు కూడా మెయిల్స్ పంపించినట్టు అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments