స్కూల్‌కు బాంబు బెదిరింపు పంపిన విద్యార్థి.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (14:11 IST)
ఓ విద్యార్థి ఒకడు తాను చదువుతున్న పాఠశాలకే బాంబు బెదిరింపుపంపాడు. పాఠశాలకు వెళ్లేందుకు మూడ్ లేకపోవడంతో ఈ పనికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలో చోటుచేసుకుంది. బాంబు పెట్టినట్టు బెదిరింపు రావడంతో స్కూల్ యాజమాన్యం స్కూల్ మొత్తానికి సెలవు ప్రటించింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్‌కు చెందిన 14 యేళ్ల బాలుడు శుక్రవారం పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కానీ, తల్లిదండ్రులు మాత్రం స్కూల్‍‌కు వెళ్ళాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపాడు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం చేయడంతో వారు వచ్చి స్కూల్ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈమెయిల్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇందులో ఆ పాఠశాలలో చదివే 14 యేళ్ల బాలుడే ఈ బెదిరింపులకు పాల్పడినట్టు తేలింది. పైగా, తాను పంపిన మెయిల్ నమ్మదగినదిగా ఉండేందుకు వీలుగా మరో రెండు పాఠశాలలకు కూడా మెయిల్స్ పంపించినట్టు అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments