Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్‌కు బాంబు బెదిరింపు పంపిన విద్యార్థి.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (14:11 IST)
ఓ విద్యార్థి ఒకడు తాను చదువుతున్న పాఠశాలకే బాంబు బెదిరింపుపంపాడు. పాఠశాలకు వెళ్లేందుకు మూడ్ లేకపోవడంతో ఈ పనికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలో చోటుచేసుకుంది. బాంబు పెట్టినట్టు బెదిరింపు రావడంతో స్కూల్ యాజమాన్యం స్కూల్ మొత్తానికి సెలవు ప్రటించింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్‌కు చెందిన 14 యేళ్ల బాలుడు శుక్రవారం పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కానీ, తల్లిదండ్రులు మాత్రం స్కూల్‍‌కు వెళ్ళాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపాడు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం చేయడంతో వారు వచ్చి స్కూల్ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈమెయిల్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇందులో ఆ పాఠశాలలో చదివే 14 యేళ్ల బాలుడే ఈ బెదిరింపులకు పాల్పడినట్టు తేలింది. పైగా, తాను పంపిన మెయిల్ నమ్మదగినదిగా ఉండేందుకు వీలుగా మరో రెండు పాఠశాలలకు కూడా మెయిల్స్ పంపించినట్టు అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments