Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ : ఫిబ్రవరి 5న పోలింగ్

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (16:39 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. జనవరి పదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. 
 
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జనవరి 10వ తేదీన విడుదల అవుతుంది. నామినేషన్లు సమర్పణకు జనవరి 17వ తేదీన చివరి తేదీ. నామినేషన్ల పరిశీలనకు జనవరి 18వ తేదీన ప్రారంభంకానుంది. జనవరి 20వ తేదీన నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 
 
కాగా, ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.08 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కోసం 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 85 యేళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments