Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో దీపావళి.. వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు.. ఎందుకు?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (17:16 IST)
దీపావళి పర్వదినం వస్తేనే.. అందరూ ఎగిరిగంతేస్తారు. కానీ దేశ రాజధాని ఢిల్లీ వాసులు మాత్రం వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? దీపావళికి తర్వాత ఓ పదిరోజుల తర్వాత.. ఆ రాష్ట్రంలో అత్యంత విషపూరిత వాయువులు మరింత వ్యాపిస్తాయని తెలుస్తోంది.
 
గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో విష వాయువులు అధికంగా వ్యాపిస్తుండడం.. కాలుష్యం అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా.. వాయు కాలుష్యం భూతంగా మారిపోతోంది.

దీనికి తోడు టపాకాయల్ని దీపావళికి కాల్చడంతో ఏర్పడే కాలుష్యంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం వున్నట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
దీపావళి రోజు టపాకాయలు కాల్చడానికి కేవలం రెండు గంటలు మాత్రమే సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినప్పటికి ... ఆ రెండు గంటలు కూడా ఎంతటి ప్రమాదానికి కారణం అవుతుందోనని ఢిల్లీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి పలు సూచనలు చేసింది. నిర్మాణ పనులు, విద్యుత్ రంగానికి సంబంధించిన పనులను బ్యాన్ చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments