Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి కంట్లో కారం కొట్టి.. గ్రైండర్ రాయితో హతమార్చిన కూతురు.. వాలెంటైన్స్ డే రోజున?

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (17:29 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ తల్లిని కుమార్తె హత్య చేసింది. అదీ ప్రేమికుడిలో కలిసి కన్నతల్లి కంట్లో కారం కొట్టి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా పోలీస్ అధికారికే ఈ ఘోరం జరిగింది. ఈమెకు పదో తరగతి చదువుతున్న కుమార్తె వుంది. 
 
ఈమెకు పక్కింట్లో వున్న జితేంద్ర (19) అనే వ్యక్తితో ప్రేమ చిగురించింది. తన కుమార్తె ప్రేమాయణం గురించి తెలుసుకున్న మహిళా పోలీస్ అధికారి కూతురిని మందలించింది. ఇంకా ఆమెను కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆవేశానికి గురైన పదో తరగతి బాలిక.. ప్రేమికుడితో కలిసి.. కన్నతల్లినే చంపేసింది. కన్నతల్లి ముఖంపై కారం కొట్టి.. ఆపై ప్రేమికుడితో కలిసి.. గ్రైండర్ రాయితో కొట్టి హతమార్చింది. 
 
ఈ ఘటనపై మహిళా పోలీసు అధికారి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో జితేంద్ర, పదో తరగతి బాలికనే నిందితులని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments