Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాపాడాల్సినవారే కామాంధులయ్యారు, లేడీ టీచర్‌ను కొడుతూ గ్యాంగ్ రేప్

కాపాడాల్సినవారే కామాంధులయ్యారు, లేడీ టీచర్‌ను కొడుతూ గ్యాంగ్ రేప్
, శనివారం, 15 ఫిబ్రవరి 2020 (20:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే కామాంధులయ్యారు. ఇంటికి వెళ్తున్న లేడీ టీచర్ పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే... గోరఖ్ పూర్ జిల్లా పరిధిలోని గోరఖ్ నాథ్‌లో 24 ఏళ్ల లేడీ టీచర్ తన సోదరి ఇంటి నుంచి వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు పోలీసులు ఆమెను అడ్డగించారు. ఎక్కడి నుంచి వస్తున్నావ్.. వ్యభిచారం చేసి వస్తున్నావా అంటూ ఆమెను బలవంతంగా బైకుపై ఎక్కించుకుని పోలీసు క్వార్టర్స్ లోని ఓ గదికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. 
 
బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా కొడుతూ తమ పశువాంఛను తీర్చుకున్నారు. అనంతరం ఆమె చేతిలో రూ.600 పెట్టి ఆమె వ్యభిచారిణి అన్నట్లుగా ప్రవర్తించారు. బాధితురాలు ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిపై జరిగిన అత్యాచారంపై తమకు అనుమానంగా వుందంటూ పోలీసులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనితో విషయం కాస్తా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాంకేతికతలో ఏపీ పోలీసుల ప్రతిభ.. ఐదు అవార్డులు