బెంగళూరులో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:09 IST)
బెంగళూరు నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గు ముఖం పడుతోంది. రాష్ట్రంలో మూడు వారాలక్రితం 6 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలతో 3 లక్షలకు చేరుకున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులతో కలిపి 2,93,024 యాక్టివ్‌ కేసులు ఉండగా మృతుల సంఖ్య 30,017కు చేరుకుంది.

తాజాగా 16,387 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 4095, మైసూరు 1687, బెళగావి 1006 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో వందల్లో కేసులు నమోదు కాగా అత్యల్పంగా బీదర్‌లో 23 మందికి పాజిటివ్‌ సోకింది.

రాష్ట్ర వ్యాప్తంగా 21,199 మంది కోలుకోగా బెంగళూరులో 8,620 మంది, తుమకూరులో 1036, మైసూరులో 1034, బెళగావిలో 990, హాసన్‌లో 979 మంది కోలుకున్నారు. ఇతర జిల్లాల్లోనూ డిశ్చార్జ్‌ల సంఖ్య ఆశాజనకంగా ఉంది.

తాజాగా 463 మంది మృతి చెందగా అత్యధికంగా బెంగళూరులో 307 మంది, బెళగావిలో 17 మంది, బెంగళూరు రూరల్‌, హాసన్‌లో 12 మంది మృతి చెందగా ఇతర జిల్లాల్లో అంతకులోపు నమోదు కాగా యాదగిరి, బీదర్‌లలో ఒకరు కూడా మృతి చెందలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments